Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో : కొరియా ద్వీపకల్పంలో సైనిక విన్యాసాలు నిలిపివేసినట్టు జపాన్ ప్రకటించింది. ఈనెల12న సింగపూర్ నగరంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య భేటీ జరిగిన సంగతి తెలిసిందే. అణ్వస్త్ర నిరాయుధీకరణకు ఉత్తరకొరియా కట్టుబడి ఉందని భేటీలో కిమ్ వెల్లడించారు. ఇరుదేశాధినేతల మధ్య జరిగిన సమావేశం సత్ఫలితాలను ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా క్షీణిస్తున్నాయి. కాగా, 1950 నుంచి 1953 మధ్య కాలంలో కొరియా యుద్ధం సంభవించింది. ఈ యుద్ధం అనంతరం ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఉత్తరకొరియాపై కక్ష్య సాధింపు కోసం అగ్రరాజ్యంతో దక్షిణకొరియా చేతులు కలిపింది. కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియా, జపాన్, అమెరికా బలగాలు ఉమ్మడి సైనిక విన్యాసాలు నిర్వహించేవి. ఈ విన్యాసాలతో ఉత్తరకొరియాను మరింత రెచ్చగొట్టేందుకు ప్రయత్నించేవి. అయితే, ట్రంప్-కిమ్ భేటీ ఫలితంగా కొరియా ద్వీపకల్పంలో శాంతియుత వాతావరణం నెలకొంది. కొరియా ద్వీపకల్పంలోని తమ బలగాలను వెనక్కి రప్పించనున్నట్టు జపాన్ వెల్లడించింది.