Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: బ్రిటన్ రాజధాని లండన్లోని క్రాస్ రైల్వేస్టేషన్లో బాంబు కలకలం రేపింది. ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉందని, రైల్వే స్టేషన్ను పేల్చేస్తానంటూ పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో, బ్రిటన్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాంబు స్క్వాడ్ రైల్వేస్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాంబు కలకలం నేపథ్యంలో రైల్వేస్టేషన్లోని ప్రయాణీకులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్లో సేవలు పునరుద్ధరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పోలీస్ ప్రతినిధి వెల్లడించారు. అండర్గ్రౌండ్ సర్వీసులను అధికారులు క్రమబద్ధీకరించారని, ప్రయాణీకులు ట్రైన్ షెడ్యూల్స్లో మార్పులు గమనించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.