Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్... ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీ చైర్మెన్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ అమ్జాద్ ధ్రువీకరించారు. పాకిస్తాన్ ఎన్నికల సంఘానికి తన రాజీనామా పత్రాన్ని మెయిల్ ద్వారా ముషారఫ్ పంపించినట్టు తెలిపారు. పార్టీ బాధ్యతలను విదేశాల నుంచి నిర్వహించడం దీర్ఘకాలిక ప్రయోజనాల ద ష్ట్యా సాధ్యం కాదంటూ లేఖలో ముషారఫ్ పేర్కొన్నారు. ముషారఫ్ తన ఏపీఎంఎల్ పార్టీని 2010లో స్థాపించారు. 2013లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల మందు ఎన్నికలను బహిష్కరించి.. ముషారఫ్ సంచలనం సృష్టించారు. అయినా ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసి గెలుపొందడం గమనార్హం.