Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యూనస్ఎయిర్స్: అర్జెంటీనాలోని ప్రధాన కార్మిక సంఘాలన్నీ సోమవారం నాడు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశాధ్యక్షుడు మారికో మాక్రీ అమలుజేస్తున్న ఆర్థిక విధానాలకు, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)తో కుదుర్చుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా కార్మికసంఘాలన్నీ ఆందోళనకు దిగాయి. వివిధ పార్టీలకు చెందిన కార్మిక సంఘాలు సైతం సోమవారం నాటి సమ్మెలో పాల్గొంటున్నాయని 'కౌన్సిల్ ఆఫ్ ద జనరల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ లేబర్' (సీజీటీ) మీడియాకు తెలియజేసింది. ఎలాంటి జనసమీకరణ జరపకుండా ఒక్క రోజు సమ్మెను తాము జరపబోతున్నామని సీజీటీ ప్రకటించింది. దేశ ఆర్థికరంగం కుదేలవడానికి కారణం విద్యుత్. కార్మికులకు, ఉద్యోగులకు సరైన జీతభత్యాలు లేక కొనుగోలు శక్తి దెబ్బతిన్నదని, విధానపరమైన లోపాలున్నాయని పాలకులకు తెలియజేశామని, విదేశీ వాణిజ్యంపై ఎంచుకున్న విధానాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని సీజీటీ గ్రూపు సభ్యుడు హెక్టర్ డాయెర్ అన్నారు.