Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్: దక్షిణ కొరియా మాజీ ప్రధాని కిమ్ జోంగ్ పిల్ కన్నుమూశారు. ఆయన ద.కొరియా నిఘా సంస్థ వ్యవస్థాపకులు. 92ఏండ్ల కిమ్ పిల్ రెండు సార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. వృద్ధాప్య సమస్యలతో కిమ్ పిల్ మరణించినట్టు సియోల్లోని సూన్చున్ హైయాంగ్ యూనివర్సిటీ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. 1961లో కొరియాలో ఆర్మీ మేజర్ జనరల్ పార్క్ చుంగ్ హీ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించేందుకు సహకరించిన వారిలో కిమ్ పిల్ కీలక వ్యక్తి. ఆ తర్వాత కిమ్ పిల్ కొరియన్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీని స్థాపించారు. ఇప్పుడు అదే నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీస్గా మారింది. ప్రధానమంత్రి పదవిలోకి రాకముందే ఆయన దీన్ని స్థాపించారు. పార్క్ చుంగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 1971-75 కాలంలో, కిమ్ డే జంగ్ అధ్యక్షుడిగా ఉన్న 1998-2000 సమయంలో కిమ్ జోంగ్ పిల్ ప్రధానిగా పనిచేశారు.