Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏథెన్స్: మూడేండ్ల క్రితం గ్రీసు ఆర్థిక సంక్షోభం యావత్తు ప్రపంచాన్నే ఆందోళనకు గురిచేసింది. రుణ దాతల తీరును ఆ దేశ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ తీవ్రంగా తప్పుబట్టాడు. గ్రీసు-రుణ దాతల మధ్య చక్కిటి ఒప్పందం కుదిరేంతవరకూ దేశ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం దొరకదని, అంతవరకూ తాను టై ధరించనని 2015లో శపథం చేశాడు. మూడేండ్ల తర్వాత తాజాగా గ్రీస్కు రుణ దాతల మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేస్తూ...టై ధరించటాన్ని పై ఫొటోలో చూడొచ్చు.