Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బహిరంగ సభలో బాంబు పేలుడు..
- ఒకరు మృతి...అనేకమందికి గాయాలు
అడ్డిస్ అబాబా: ఇథియోపియా నూతన ప్రధాని అబియ్ అహ్మద్ ప్రసంగిస్తున్న బహిరంగ సభలో శనివారం బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ప్రధాని ఛీఫ్-ఆఫ్-స్టాఫ్ ఫిట్సుం అరేగా మాత్రం 83 మంది గాయపడ్డారని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనపై ప్రధాని అబిరు అహ్మద్ మాట్లాడుతూ..
''ఇథియోపియా సమైక్యం కావటాన్ని వ్యతిరేకి స్తున్న శక్తులు ఈ విఫలయత్నం చేశాయి'' అని వ్యాఖ్యానించారు. రాజధాని నగరం అడ్డిస్ అబాబాలోని మెస్కెల్ స్క్వేర్లో వేలాది మందితో జరుగుతున్న బహిరంగ సభ పైకి గ్రెనేడ్ విసరటంతో ఈ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది.
పలడు చోటుచేసుకోగానే ప్రధాని అబిరుని తక్షణమే అక్కడి నుంచి తరలించారు. ఇథియోపి యాలో ఏండ్ల తరబడి సంఘర్షణ కొనసాగుతోంది. కొన్నిసార్లు అవి హింసాత్మకంగా మారుతున్నాయి. ఇంతకుముందున్న ప్రధానమంత్రి హైలెమారియమ్ డెసాలెన్ ఫిబ్రవరిలో అనూహ్యంగా రాజీనామా చేయటంతో అబిరు ఆ పదవి చేపట్టారు. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన చేపడుతున్న ఓరోమో జాతి నుంచి దేశానికి ప్రధానమంత్రి అయిన మొదటి వ్యక్తి ఆయన.దేశంలో తమ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ.. ఏళ్ల తరబడి తమను రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా దూరంపెట్టారనేది వారి ప్రధాన ఆరోపణల్లో ఒకటి. రాజకీయ అసమ్మతివాదులను హింసించటం, రాజకీయ హత్యలు...సహా అనేక మానవ హక్కుల ఉల్లంఘనకు ఇథియోపియా ప్రభుత్వం పాల్పడుతోందన్న ఆరోపణలూ ఉన్నాయి. అయితే.. అబిరు ప్రధాని అయ్యాక.. అధికారం మీద రాజ్యానికి ఉన్న బలమైన పట్టును సడలించటానికి సంస్కరణలు ప్రారంభించారు. వందలాది వెబ్సైట్లు, టీవీ చానళ్లపై నిషేధాన్ని తొలగించటం వాటిలో ఒకటి.
అబియ్ అహ్మద్ ఎవరు?
ఒరోమియాలోని అగారో నగరంలో జన్మించిన 42 ఏండ్ల అబిరు.. క్రైస్తవ - ముస్లిం కుటుంబం నుంచి వచ్చారు. సైన్యంలో పనిచేశారు. అధికార ఇథియోపియన్ పీపుల్స్ రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఈపీఆర్డీఎఫ్) సంకీర్ణంలోని నాలుగు ఆదివాసీ పార్టీల్లో ఒకటైన ఒరోమో పీపుల్స్ డెమొక్రటిక్ ఆర్గనైజేషన్ (ఓపీడీఓ) నాయకుడు ఆయన ఉన్నారు. ఇంటర్నెట్ మీద ప్రభుత్వం పూర్తి నియంత్రణ గల ఈ దేశంలో సైబర్ భద్రతను పర్యవేక్షించే ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ ఏజెన్సీని స్థాపించారు. అనంతరం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు మంత్రి అయ్యారు. ఒరోమో యువతతో పాటు ఇతర ఆదివాసీ బృందాలలోనూ అబిరుకి భారీ మద్దతు ఉందని భావిస్తారు.