Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియంలు రావల్పిండిలోని అడియాలా జైల్లో మొదటి రోజు గడిపారు. విఐపిలైన వారిద్దరికీ 'బి' క్లాస్ సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు శనివారం తెలిపారు. వారిరువురు లండన్ నుండి శుక్రవారం రాత్రి లాహోర్కు చేరుకోగానే విమానా శ్రయంలోనే ఎన్ఎబి (నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్ తీసుకెళ్ళిన వీరిని వేరువేరుగా అడియాలా జైలుకు తీసుకె ళ్ళారు. తొలుత రాజధానిలోని సిహాలా పోలీసు ట్రెయినింగ్ కాలేజీలోని విశ్రాంతి గృహాన్ని సబ్ జైలుగా ప్రకటించి వారిద్దరినీ తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అందులో వుంచుతారని ప్రభుత్వ నోటిఫికేషన్ పేర్కొంది. కానీ ప్రస్తుతానికి అడియాలా జైల్లోనే వుంచాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.