Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'జాన్సన్ అండ్ జాన్సన్'కు ఎదురుదెబ్బ
- 22 మంది మహిళలకు అనుకూలంగా తీర్పు
సెయింట్ లూయిస్(అమెరికా): జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్లో ఉన్న ఆస్బెస్టాస్ వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని 22 మంది మహిళలు కోర్టుకెక్కారు. దీంతో వీరికి ఏకంగా 4.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.31 వేల కోట్లు) పరిహారాన్ని చెల్లించాలంటూ సెయింట్ లూయిస్లోని (మిస్సోరి రాష్ట్రం) ఫెడరల్ కోర్టు తీర్పు చెప్పింది. తాత్కాలిక పరిహారం కింద 550 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.3500 కోట్లు) చెల్లించాలని ఆదేశాలిచ్చిన కోర్టు కొద్ది సమయంలోనే, పూర్తి స్థాయి పరిహార ఆదేశాలను ప్రకటించడం గమనార్హం. జూన్ 4న మొదలైన ఈ కేసులో బుధవారం చివరి దశ వాదనలు జరిగాయి.
మార్కెట్ నుంచి ఉపసంహరిస్తే మంచిది
'ఉత్పత్తుల్లో ఆస్బెస్టాజ్ ఉందన్న విష యం కంపెనీకి తెలుసునని.. అయితే అది వినియోగదార్లను హెచ్చరించలేకపో యింద'ని ఈ సందర్భంగా కక్షిదార్ల వైపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన కోర్టు ఆ వాదనలతో అంగీకరిస్తూ.. 'మీ స్వరం.. మహిళల తరఫు న మాత్రమే కాదు.. ప్రపంచ తరఫున వాదించింది. ప్రజల జీవితాలతో కంపెనీ ఆడుకోజాలద'ని పేర్కొంది. కేసు వేసిన 22 మంది మహిళల్లో ఆరుగురు క్యాన్సర్తో మర ణించారు. 'ఇది దిగ్భ్రాంతి కలిగించేదే.. కానీ ఈ సంఘటనకు జాన్సన్ అండ్ జాన్సన్కు సంబంధం లేద'ని కంపెనీ తరఫు న్యాయవా ది వాదనల సందర్భంగా పేర్కొన్నారు. కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు వెళతామని 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ తెలియజేసింది.