Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10మంది మృతి
కాబూల్: ఆఫ్ఘని స్థాన్లోని గ్రామీణ పునరావాస, అభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యాల యంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 10 మంది మృతి చెందారు. ఈ కార్యాలయంపై దాడి జరగడం నెలరోజుల వ్యవధిలో ఇది రెండోసారి. ఆదివారం సాయంత్రం 4.30 సమయంలో పేలుడు పదార్థాలు ధరించిన ఒక వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
కార్యాలయంలోని ఉద్యోగులు విధులు ముగించుకొని బయటకు వస్తున్నప్పుడు ఈ దాడి జరిగింది. విదేశీయులను తీసుకు వెళ్తున్న ఓ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు ఫ్రాన్స్ వాసులు కూడా గాయపడినట్టు సమాచారం. జూన్ 11న ఇక్కడే జరిగిన ఒక ఆత్మాహుతి దాడిలో దాదాపు 17 మంది మృతి చెందగా మరో 40 మంది గాయపడ్డారు. అప్పడు కూడా ఉద్యోగులు విధులు నిర్వహించుకొని బయటకు వెళుతున్నప్పుడే బాంబు దాడి జరిగింది.