Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్: జర్మనీలోని ఓ నగరంలో చనిపోతే పూడ్చి పెట్టడానికి స్థలం కరవైంది. దీంతో అక్కడి శ్మశానంలో ఉన్న కాస్త ఖాళీ స్థలానికి డిమాండ్ బాగా పెరిగిపోయింది. చోటు కోసం చాలా మంది దరఖాస్తు చేసుకోవడంతో అక్కడి అధికారులు శ్మశానంలో ఖాళీ ఉన్న స్థలాలకు లాటరీ పెట్టారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. జర్మనీలోని బ్రెచ్స్గాడెన్ పట్టణంలో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
బవేరియన్ పర్వతశ్రేణుల్లోని బ్రెచెస్గాడెన్లోని శ్మశాన వాటికలో లాటరీ నిర్వహించనున్నారని ఆదివారం జర్మనీలోని ఓ వార్తాసంస్థ వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 17వ శతాబ్దానికి చెందిన ఆ శ్మశానవాటికలో చోటు లేకపోవడంతో చాలా ఏండ్లుగా అధికారులు దరఖాస్తులను తీసుకోవడం లేదు. అయితే తాజాగా కొంత చోటు దొరకడంతో ఆ స్థలాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు అధికంగా వచ్చాయి. 200 స్థలాలు ఖాళీగా ఉండగా 280 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎవరికి కేటాయించాలో అర్థంకాక అధికారులు లాటరీ వేయాలని నిర్ణయించారు. బుధవారం అక్కడ లాటరీ నిర్వహించనున్నారు.