Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 23 మందికి గాయాలు
హావాయి : అగ్ని పర్వతాన్ని దగ్గరగా చూడాలనే అత్యుత్సాహం 23 మంది పర్యటకులను గాయాలపాలు చేసింది. హావాయి ద్వీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సముద్రంలో నుంచి ఎగసిపడుతున్న అగ్నిపర్వతం అందాలను బోటు నుంచి వీక్షిస్తూ పర్యటకులు కేరింతలు కొడుతున్నారు. దాదాపు 300 మీటర్ల దూరంలో ఉండగా అగ్నిపర్వత శకలాలు బాంబుల్లా విరుచుకుపడ్డాయి. దీంతో పర్యాటకుల పడవకు చిల్లులుపడ్డాయి. ఈ ఘటనలో 23 మంది గాయపడ్డారు.