Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 49 మంది మృతి
కనో: నైజీరియాలో వరదల ధాటికి 49 మంది ప్రాణాలు కోల్పో యారు. నైజీరియా సరిహద్దులోని జిబియా జిల్లాలో ఆదివారం అర్థరాత్రి నుంచి కుండపోత వర్షాలు కురిశాయి. జిల్లాలోని ఐదు గ్రామాల పరిధిలో వరద నీరు పోటెత్తడంతో నది తీర ప్రాంతం కొట్టుకుపోయింది. దీంతో ఆయా గ్రామాల్లో పలు ఇండ్లు ముం పునకు గురై 49 మంది ప్రాణాలు విడిచారని కట్సినా అత్యవసర విభాగం సిబ్బంది ప్రతినిధి అమిను వజిరి తెలిపారు. ఆచూకీ లేని మరో 20 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామన్నారు. మొత్తం 2వేల మందికిపైగా నిరాశ్రయు లయ్యారని, వారికి జిబియా కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఆశ్రయం కల్పించామని తెలిపారు. కొంత మంది బాధితులు కుప్పకూలిన ఇండ్ల అడుగుభాగంలో ఇరుక్కు పోయారు. వీరిలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.