Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమ్నెస్టీ నివేదిక
డమాస్కస్ : రక్కా నగరంలో హక్కుల ఉల్లంఘన ఘటనలు పెరిగిపోవడం పట్ల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఉగ్రవాదులను పారద్రోలేందు కోసం యూఎస్ సంకీర్ణదళాలు నిర్వహిస్తున్న యాంటీ టెర్రరిజం ఆపరేషన్లో అమాయక ప్రజలు మృతి చెందారని తెలిపింది. ఆమ్నెస్టీ అంతర్జాతీయ హక్కుల సంఘం విడుదల చేసిన నివేదికలోని వివరాల ప్రకారం... సిరియాలోని రక్కా ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రమూకలను లక్ష్యంగా చేసుకొని అమెరికా సంకీర్ణదళాలు ప్రత్యేక వైమానిక దాడులు నిర్వహించాయి.
యూఎస్ సంకీర్ణదళాలు జారవిడిచిన బాంబుల కారణంగా అమాయక ప్రజలు మృతి చెందారు. గతనెల 5న రక్కా ప్రాంతంలోని 112 కుటుంబాల వద్ద నుంచి రక్కాలో హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం సేకరించామని ఆమ్నెస్టీ అధికార ప్రతినిధి డొనాటెల్లా రొవేరా తెలిపారు.