Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది మృతి
టోక్యో: జపాన్లో వడగాడ్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. వడగాడ్పుల ధాటికి మూడు రోజుల్లో 14 మంది మృతి చెందారు. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు భీతిల్లు తున్నారు.
గతవారం జపాన్లో వరదలు బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. వరదల్లో చిక్కుకొని 200 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల ఉధృతి నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే కోలుకుం టున్నారు. అయితే, వడగాడ్పులు అధికమ వడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
జపాన్లో పలు ప్రాంతాల్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నదని వాతా వరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతలు పెరుగు తుండటంతో గాలిలో తేమశాతం కూడా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇబిగావా నగరంలో అత్యధికంగా 39.3 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద ఇదే అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రత అని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు టోక్యో నగరంలో 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. వరదల ధాటికి విలవిల లాడిపోయిన పశ్చిమ జపాన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 34.3 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. వరదలు సృష్టించిన బీభత్సానికి ఇక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే వడగాడ్పుల దెబ్బకు వాలంటీర్లు సహాయక చర్యలు చేపట్టలేక పోతున్నారు. వడగాడ్పుల కారణంగా సహాయక చర్యలకు అంతరాయం కల్గుతున్నది. గతేడాది అధిక ఉష్ణోగ్రతల ధాటికి జపాన్లో 48మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.