Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రసిలియా: త్వరలో జరుగనున్న బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు లూలా డిసిల్వా అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ వేలాది మంది మద్దతుదారులు భారీ ప్రదర్శన నిర్వహించారు. 'ఫ్రీ లూలా మార్చ్' పేరుతో జరిగిన ఈ ప్రదర్శనలో పాల్గొన్న లూలా మద్దతుదారులు 50 కి.మీ దూరాన్ని కాలినడకన ప్రయా ణించి మంగళవారం నాడు బ్రసిలియా నగరానికి చేరుకున్నారు. లూలా అభ్య ర్థిత్వాన్ని అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టు ముందు వారు వంతుల వారీగా ప్రదర్శనలు జరుపుతారని నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామీణ భూమిలేని పేదల ఉద్యమం (ఎంఎస్టి), తదితర ఉద్యమ గ్రూపులకు చెందిన దాదాపు 5 వేల మంది పాల్గొన్న ఈ ప్రదర్శన నాలుగు రోజుల పాటు ప్రjణించి బ్రసిలియా చేరుకున్నట్లు తెలుస్తోంది. లూలా అభ్యర్థిత్వంపై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించే వరకూ కోర్టు వెలుపల మకాం చేయాలని నిర్ణయించుకున్న వీరు కోర్టు ఎదుట తాత్కాలిక శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో లూలాను అనర్హుడిగా ప్రకటించటం ప్రజాస్వామ వ్యతిరేక చర్య అని, ఇది బ్రెజిల్లో అస్థిరతకు దారి తీస్తుందని వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు గ్లెసీ హాఫ్మన్ చెబుతున్నారు. మాజీ అధ్యక్షుడు లూలా స్వేచ్ఛ పొందే వరకూ తాము పోరాడతామని, లూలా దేశాధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాలన్నది బ్రెజిల్ ప్రజల వాంఛ అని ఆమె వివరించారు.