Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 34 విద్యార్థులు మృతి
- ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్ ప్రకటన
కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ నగరం మరోసారి రక్తసిక్తమైంది. ఓ ట్యూషన్ సెంటర్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 34 మంది విద్యార్థులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తు న్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఐఎస్ ప్రకటించుకుంది.
అఫ్ఘాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం...కాబూల్లోని ఓ ట్యూషన్ సెంటర్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 34 మంది విద్యార్థులు మృతి చెందారు. ట్యూషన్ సెంటర్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఆత్మాహుతి దాడి అనంతరం ఈ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు శబ్దంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది యువకులే కావడం బాధాకరం. ఓ ప్రవేశ పరీక్షకు శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మిలిటెంట్లు ఈ దారుణానికి ఒడిగట్టారు.
దీంతో, క్షణాల్లో ఈ ప్రాంతంలో ఆర్తనాదాలు ప్రతిధ్వనించాయి. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధంలేదని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఇదిలా ఉండగా, బుధవారం బగ్లాన్ ప్రావిన్స్ ఉత్తర ప్రాంతంలోని మిలిటరీ ఔట్పోస్ట్పై జరిగిన మెరుపుదాడిలో 9 మంది పోలీసులు, 35 మంది సైనికులు మృతి చెందారు.