Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పన్నుల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్
సాన్ జోస్ : కోస్టా రికా నగరంలో నిరసనలు వెల్లువెత్తాయి. పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని ఇక్కడి ప్రభుత్వం యోచిస్తున్నది. ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈనెల 12న భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్యులు, టెలిఫోన్ రంగానికి చెందిన ఉద్యోగులు, మున్సిపల్ ఉద్యోగులు, రవాణా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోడ్లపై బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ట్రేడ్ యూనియన్లు, సామాజిక కార్యకర్తలు నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం తక్షణమే పన్నుల పెంపు ప్రతిపాదన ఉపసంహరించుకోకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల నేత అల్బినో వార్గస్ మాట్లాడారు. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెకేందుకు ప్రభుత్వం ప్రజలపై అధిక పన్ను భారం మోపాలని యోచిస్తోందని అన్నారు. విద్య, వైద్య రంగాలపై 2 శాతం పన్ను పెంపును ఆయన తప్పుపట్టారు. విలువ ఆధారిత పన్నుతో ( వ్యాట్ ) నిత్యావసర ధరలు కూడా మిన్నంటుతాయని అన్నారు. వ్యాట్ కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అధ్యక్షుడు కార్లోస్ అల్వరాడో అనుసరిస్తున్న విధానాలను ఆయన వ్యతిరేకించారు.