Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5గురు భద్రతా సిబ్బంది మృతి
కాబూల్ : సైనిక బలగాలకు చెందిన ఒక హెలికాప్టర్ పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో కుప్పకూలింది. పైలట్తో సహా ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోయారని స్థానిక అధికారులు శనివారం మీడియాకు తెలియజేశారు. అయితే ఇది తీవ్రవాదదాడి అయ్యే అవకాశం లేదని, సాంకేతిక లోపంతోనే హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుందని వారు భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రమాద ఘటనపై విచారణ జరుపుతామని కాబూల్లోని రక్షణ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భద్రతా బలగాల వాహనాల్ని, స్థావరాల్ని లక్ష్యంగా చేసుకొని గతకొంతకాలంగా తాలిబాన్లు దాడులు జరుపుతున్నారు. దీంతో గగనతలంలో హెలికాప్టర్స్ ద్వారా భద్రతా సిబ్బందిని తరలించే కార్యక్రమం ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సరైన శిక్షణ, ప్రణాళికలేని పైలట్స్తో ప్రమాదాలు చోటుచేసుకోవటం జరుగుతున్నాయి.