Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు పాలస్తీనీయులు మృతి
గాజా : గాజా, ఇజ్రాయిల్ సరిహద్దులో ఇజ్రాయిల్ ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు పాలస్తీనీయులు మృతి చెందారు. ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం...తమ సరిహద్దులో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందిందని, దీంతో ఈ ప్రాంతంలో వైమానిక దాడులు నిర్వహించామని అన్నారు. పాలస్తీనీయులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ వైమానిక దాడులకు పాల్పడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.