Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాతోర్న్: చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టే అద్భుతమైన అవకా శాన్ని సొంతం చేసుకున్నారు జపాన్కు చెందిన ఓ బిలియనీర్. ప్రముఖ సంస్థ స్పేస్ ఎక్స్.. చంద్రుని చుట్టూ పర్యాటకులను తిప్పే ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందుకొచ్చారు 42ఏండ్లు యుసాకు మేజావా. ఇందుకోసం స్పేస్ఎక్స్కు భారీ మొత్తం లో డబ్బు చెల్లించారు. ఈ విషయాన్ని స్పేస్ ఎక్స్ వెల్లడించింది. అంతేగాకుండా, యుసాకుతో దిగిన ఫొటోను స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఇందులో యుసాకును ఎలాన్ మస్క్ తన భుజాలపై ఎత్తుకున్నారు. 'యుసాకు చాలా ధైర్యవంతుడు. చంద్రుడి పర్యటనకు ఆయన ముందుకు రావడం గర్వంగా ఉంది' అని మస్క్ ట్వీట్ చేశారు. అయితే పర్యటన కోసం యుసాకు ఎంత మొత్తం చెల్లించారన్నది మాత్రం మస్క్ వెల్లడించలేదు. ఈ సందర్భంగా యుసాకు మాట్లాడుతూ.. 'చిన్నప్పటి నుంచి నాకు చంద్రుడు అంటే చాలా ఇష్టం. ఇది నా చిరకాల కోరిక' అని ఆనందం వ్యక్తం చేశారు. జపాన్లోని అతిపెద్ద ఆన్లైన్ ఫ్యాషన్ సంస్థ జోజోటైన్కు సీఈవో అయిన యుసాకు ఆ దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 18వ వ్యక్తి. యుసాకు సంపద విలువ 3 బిలియన్ డాలర్లు ( రూ. 21వేల కోట్లు ).
యుసాకుకు చిత్రలేఖనం అంటే ప్రాణం. అందుకే తనతో పాటు ఆరు నుంచి 8 మంది ఆర్టిస్టులను కూడా చంద్రుడి పర్యటనకు తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. భారీ వాహక నౌక అయిన బిగ్ ఫాల్కన్ రాకెట్(బీఎఫ్ఆర్) ద్వారా పర్యాటకులను చంద్రుని వద్దకు ఈ కంపెనీ తీసుకెళ్లనుంది. 2023 నాటికి ఈ పర్యాటకులను చంద్రుడి చుట్టూ తిప్పాలని స్పేస్ ఎక్స్ లక్ష్యంగా పెట్టుకుంది.