Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జర్మనీ: జర్మనీలో హైడ్రోజన్ రైలు పట్టాలెక్కింది. ఈ రైలు నుంచి పొగలుసెగలూ ఉండవు. మహా అయితే కొంత ఆవిరి లేదా నీటి చుక్కలు బయటకు వస్తాయి. వాతావరణ కాలుష్య నిర్మూలన కోసం జర్మనీ ప్రభుత్వం ఈ రైలును ఆవిష్కరించింది. వాతావరణంలో కార్బన్ శాతం పెరగడానికి డీజిల్ వాహనాలు ప్రధాన కారణం. కానీ జర్మనీలోని అల్స్టోమ్ కంపెనీ తయారుచేసిన ఈ అధునాతనమైన రైలు కాలుష్యానికి చెక్ పెడుతుంది. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. దీని ఖరీదు మాత్రం ప్రస్తుతం కొంచెం ఎక్కువే ఉంది. ఒక్కో రైలు ఖరీదు భారతీయ కరెన్సీలో రు.49 కోట్లు. డీజిల్ బండ్లతో పోలిస్తే కాలుష్యం లేకపోవడమే కాదు నిర్వహణా ఖర్చూ తక్కువే కావడం వల్ల జర్మనీలోని పలు సంస్థలు ఈ రైళ్లను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. ఈ రైళ్లను ఫ్రెంచి కంపెనీ ఆల్స్టామ్ తయారు చేసింది. కక్స్హెవెన్, బ్రిమెర్హెవెన్, బ్రీమెర్వోడ్,బక్స్ట్హ్యూడ్ మధ్య దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాయి. ప్రపంచంలోనే తొలి హైడ్రోజన్ రైలు కమర్షియల్ సర్వీసు సేవలందించేందుకు సిద్ధంగా ఉందని.. మరి కొన్ని ఈ తరహా రైళ్లను త్వరలోనే తయారు చేస్తా మని ఆల్స్టామ్ కంపెనీ సీఈఓ హెన్రీ పొపార్ట్ తెలిపారు. హైడ్రోజన్తో ఈ రైళ్లు నడుస్తాయని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక స్టేషన్లు నిర్మాణం చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. ఈ రైళ్లు హైడ్రోజన్ శక్తి మీద నడుస్తాయి. మోబైల్ ఫోన్లలో, అనేక గృహోపకరణాల్లో ఉండే లిథియం-అయాన్ బ్యాటరీలు ఇందులో ఉంటాయి. హైడ్రోజన్-ఆక్సిజన్తో కలవడం వల్ల పుట్టే శక్తి బ్యాటరీల్లో నిల్వ అవుతుంది. ఆ శక్తి రైలు నడిచేందుకు ఉపయోగిస్తారు. ఆ రెండు వాయువులు కలిస్తే నీరు ఏర్పడుతుంది. అదే ఎగ్జాస్ట్ లోనుంచి బయటకు వస్తుంది. అంటే రైలు వదిలేది నీరు లేదా ఆవిరిని మాత్రమే. కార్బన్ డయాక్సైడ్ అసలు విడుదల కాదు. అదే ఈ రైలు ప్రత్యేకత. అల్స్టోమ్ కంపెనీ ఈ రైళ్లకు కొరాడియా ఐలింట్ ట్రైన్స్ అని పేరుపెట్టింది. ఒకసారి హైడ్రోజన్ ట్యాంక్ నింపితే రైలు వెయ్యి కిలోమీటర్ల దాకా నడుస్తుందని అంటున్నారు. ఒకవేళ అదనంగా విద్యుత్తు ఉత్పత్తి అయినా అది బ్యాటరీల్లోనే నిల్వ ఉంటుంది. రైలును గత ఆదివారం పట్టాలెక్కించారు. టివి 2021 కల్లా మరో 14 రైళ్ల వరకు ప్రవేశపెట్టనున్నట్టు జర్మనీ అధికారులు వెల్లడించారు.