Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లండన్ మసీదు సమీపంలో ఘటన..
- ముగ్గురికి గాయాలు
లండన్ : బ్రిటన్ రాజధాని లండన్లోని మసీదు సమీపంలో ఓ కారు పాదచారులపైకీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా ? లేదా ఈ ఘటనలో ఉగ్రవాద కోణం దాగివుందా అనే అంశంపై విచారణ చేపడుతున్నామని బ్రిటన్ పోలీస్ అధికారులు తెలిపారు. షియా ఇస్లామిక్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించామని అన్నారు.
కాగా, లండన్లో ఇస్లామోఫోబియా భావాలు పెరిగిపోయాయి. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ముస్లింల పట్ల అసహ్య భావాలున్న పౌరులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని అన్నారు.