Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్స్కేల్పై తీవ్రత 5.9గా నమోదు
- 11 మంది మృతి, 135 మందికి గాయాలు
పోర్టోప్రిన్స్: కరీబియన్ దేశమైన హైతీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.9గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. పోర్ట్డీ పయాక్స్ నగరం నుంచి 11 మైళ్ల దూరంలో 7.2మీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించామని అన్నారు. సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అన్నారు. ఈ ఘటనలో 11మంది మృతి చెందగా, మరో 135 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైతీలో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా 11 మంది మృతి చెందారు. ఘటనాస్థలికి చేరకున్న ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. హైతీ ఉత్తరాది ప్రాంతంలో భూకంపం తీవ్రత అధికంగా ఉంది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. హైతీలో భూకంపం బారినపడి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రధాని జీన్హెన్రీ సియాంట్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2010, జనవరిలో హైతీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.1తీవ్రతగా నమోదైంది. అప్పుడు సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 3లక్షల మంది మృతి చెందారు. లక్షలాది మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. భారీ ఆస్తినష్టం సంభవించింది.