Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాకినాడ :తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇటీవల ఏసీబీకి పట్టు బడిన జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకరరావు ఇంట్లో ఏసీబీ అడిషనల్ ఎస్పి షకీలా భాను ఆధ్వ ర్యాన అధి కారులు మంగళ వారం సోదాలు నిర్వ హించారు. గతనెల 20న గిరిజన ఉపాధ్యాయుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ప్రభాకరరావు ఏసీబీకి దొరికిపోయారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న అనుమానంతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో కాకినాడ, రాజమహేంద్రవరం, తణుకు, బెంగుళూరులో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏడు ఇండ్లు, విజయనగరంలో ఒక ప్లాటు, రాజమహేంద్రవరంలో ఒక ప్లాటు, బెంగళూరులో రెండు ఖాళీ స్థలాలు, కర్నూలులో రెండు ఖాళీ స్థలాలతోపాటు విలువైన బంగారం, వెండి ఆభరణాలను గుర్తించామని ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకరరావు తెలిపారు.