Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు వారాల గరిష్ట స్థాయికి!
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.82పై మాటే
న్యూఢిల్లీ: పెట్రో ఉత్పత్తులపై ధరలలో మళ్లీ అదే తీరు. వరుసగా నాలుగో రోజూ ఇంధన ధరలు పెరిగాయి. దీంతో మూడు వారాల గరిష్ట స్థాయికి ధరలు చేరుకోవడం గమనార్హం. దేశరాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 82ను దాటింది. మంగళవారం తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్పై రూ.0.23 పెరిగి ధర రూ. 82.26 చేరుకోగా, డీజిల్పై రూ.0.29 పెరిగి 74.11 గా నమోదైంది. ఇక దేశవాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్పై రూ.0.23 పెరిగి 87.73కు చేరుకుంది. డీజిల్పై రూ. రూ. 0.31పెరగడంతో అది 77.68గా నమోదైంది. ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ.87.21గా ఉండగా, డీజిల్ ధర రూ. 80.61కు చేరుకున్నది. కోల్కతాలో లీటరుపెట్రోల్ ధర రూ.84.09, చెన్నైలో 85.50గా ఉంది. ఈ రెండు నగరాల్లో డీజిల్ధరలు వరుసగా రూ. 75.96, 78.35గా ఉన్నాయి. ఈ నెల 5న పెట్రో ఉత్పత్తులపై కేంద్రం, చమురు సంస్థలు రూ. 2.50 తగ్గిం చి మళ్లీ ధరలు పెంచుతుండటం గమనార్హం. కాగా, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నవం బరు నుంచి 2016 జనవరి మధ్య ఎక్సైజ్ సుంకం పెట్రోల్పై రూ. 11.77 పెరగగా, డీజిల్పై రూ. 13.47 పెరిగింది. అయితే ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహజ్వాలలను చల్లార్చడానికి కంటితుడుపు చర్యగా పెట్రో ఉత్పత్తులపై కొద్ది మొత్తంలో తగ్గిస్తుండటం గమదనార్హం.