Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరోపాలో కొనసాగుతున్న ఆందోళనలు
సోఫియా : బల్గేరియాలోని రూస్ ప్రాంతానికి చెందిన జర్నలిస్ట్ విక్టోరియా మారినోవా (30) దారుణహత్యకు గుర య్యారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం దుండ గులు అత్యంత కిరాతకంగా ఆమెను హతమార్చినట్టు పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. మృత దేహంపై బలమైన గాయాలు గుర్తించామని అన్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడు తున్నాయని అన్నారు. కాగా, ఐరోపా సమాఖ్య నుంచి బల్గేరియాకు భారీగా నిధులు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో తారాస్థాయిలో అవకత వకలు జరిగాయని మారినోవా గళమిప్పారు. అవినీతి అధికారులపై తన పోరాటం కోనసా గించారు. ఆమె రచించిన పలు పరిశోధనాత్మక వ్యాసాలు ప్రజలను చైతన్య పరిచాయి. మారినోవా దారుణ హత్య కు గురయ్యారని, ఆమె శవాన్ని డాన్యూబ్ నదీ తీర ప్రాంతంలో గుర్తిం చినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి మ్లాదెన్ తెలి పారు. మారినోవా మృతితో ఐరో పాలో నిరసనలు వెల్లువెత్తాయి. నింది తులను కఠినంగా శిక్షించాలని నిరససకారులు డిమాండ్ చేశారు. కొవొత్తులతో నిరసన ర్యాలీ తీశారు. హంతకులను పట్టుకోవాలని ఐరో పా సమాఖ్యతో పాటు జర్మనీ ఓ ప్రకటనలో బల్గేరియాను కోరాయి.