Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి సహా 8 మంది మృతి
- ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్ల ప్రకటన
కాబూల్ : అఫ్ఘనిస్తాన్లో ఆత్మాహుతి దాడి జరిగింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచార ర్యాలీ లక్ష్యంగా తాలిబన్లు ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి సహా 8 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...లష్కర్ ఘా ప్రావిన్స్లో మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సాలెV్ా మహ్మద్ అక్జౌ అనే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. తాలిబన్ల బెదిరింపులకు భయపడొద్దని ధైర్యంగా ఓట్లు నమోదు చేయాలని ఓటర్లను కోరారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కొద్దిసేపటిలోనే ఈప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ ఘటనలో సాలెV్ా అక్కడిక్కడే మృతి చెందారు. ఆయనతో పాటు మరో ఏడుగురు మృతిచెందారు. కాగా, అఫ్ఘాన్లో ఈ నెల 20న పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లెవరూ ఓట్లు నమోదు చేయొద్దని, ఎన్నికలను బహిష్కరించాలని తాలిబన్ సంస్థ హెచ్చరించింది. ఎన్నికల ప్రచార ర్యాలీలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని ఘాటుగా హెచ్చరించింది. అఫ్ఘాన్ ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా లేమని వెల్లడించింది. అఫ్ఘాన్లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలోని 249 సీట్ల కోసం 2,565 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆత్మాహుతి జరగడం ఇది రెండోసారి. ఈనెల 2న నాన్ఘర్ ప్రావిన్స్లో తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. అఫ్ఘాన్లో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించొద్దని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు.