Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్సు బోల్తాపడి 50 మంది మృతి
నైరోబి : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బోల్తా పడిన ఘటనలో 50 మంది మృతి చెందారు. కెన్యా రాజధాని నైరోబీ నుంచి కిసూము నగరానికి బస్సు బయల్దేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. అతి వేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని అధికారులు అనుమాని స్తున్నారు. కెన్యా ఎస్పీ జోసఫ్ బాయినట్ తెలిపిన వివరాల ప్రకారం...నైరోబీ నుంచి బయల్దేరిన పాసింజర్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 50 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడుపుతూ నియంత్రణ కోల్పోవడంతోనే బస్సు అదుపుతప్పి బోల్తాపడినట్టు క్షతగాత్రుల్లో ఒకరు పేర్కొన్నారని ఎస్పీ తెలిపారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని అన్నారు. కాగా, కెన్యాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇరుకైన దారులు, ఘాట్ రోడ్లు, రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించక పోవడమే తరచూ ప్రమాదాలకు కారణమనే విమర్శలు వినిపి స్తున్నాయి. గతేడాది డిసెంబర్లో బస్సు, లారీ ఢకొీని 36 మంది మృతి చెందారు. మిగా నగరంలో ఈప్ర మాదం సంభవించింది. ప్రపంచ దేశాలన్నింటిలో కెన్యాలోనే అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ నివేదికను వెల్లడించింది.