Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా ఆర్మీలో అనుమానాలు..!
- రెండు రోజుల పాటు సేవలు నిలిపేసిన పెంటగాన్
వాషింగ్టన్ : తాము ఉపయోగిస్తున్న యుద్ధ విమానాల నాణ్యతపై అమెరికా ఆర్మీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. రెండు రోజుల పాటు వీటి సేవలను నిలిపివేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసింది. అమెరికా ఆర్మీ ప్రకటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా, దక్షిణ కరోలినాలో గతనెల అమెరికా యుద్ధవిమానం ఎఫ్-35 కుప్పకూలిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. అయితే, ఈ ఘటన తర్వాత అమెరికా ఆర్మీలో గుబులు మొదలైంది. ఎఫ్-35 విడిభాగాల తయారీలో లొఖీడ్ మార్టిన్ కాంట్రాక్టు సంస్థ నాణ్యత పాటించడంలేదని పెంటగాన్ ఆరోపిస్తున్నది. వీటి చమురు నిల్వ ట్యూబ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ఎఫ్-35 యుద్ధవిమానాలను లొఖీడ్ మార్టిన్ సంస్థ నుంచి అమెరికా గత 17 ఏండ్ల నుంచి కొనుగోలు చేస్తోంది. తొలిసారిగా గతనెలలో ఈ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ఈ సంస్థపై అమెరికా రక్షణ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. ఒక్కో యుద్ధ విమానం కొనుగోలుకు అమెరికా ప్రభుత్వం 89మిలియన్ డాలర్లు ( రూ.6,56,90,90,000 ) ఖర్చు చేస్తున్నది.