Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాస్కో: భారత్పై అమెరికా విధించాలనుకుంటున్న ఆంక్షలు భారత్-రష్యాల మధ్య ఉన్న రక్షణ ఒప్పందాలపై ఏమాత్రం ప్రభావం చూపలేవని భారత్లో రష్యా రాయబారి నికోలే కుదాషెవ్ అన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోడీతో పలు విషయాలపై చర్చించారని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి ప్రాధాన్యత అంశాలపై ఇరువురు నేతలు చర్చించారని... ఒకవేళ అమెరికా ఆంక్షలు విధించినట్టయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఏం చేయాలనే అంశంపై కూడా చర్చించారని అన్నారు. ఆంక్షలకు సంబంధించి తాము ఏ నిర్ణయం తీసుకుంటామో భారత్లో త్వరలోనే తెలుసుకుంటుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నికోలే పైవిధంగా స్పందించారు.