Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: రష్యాతో భారత్ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. దీనిపై త్వరలోనే తాను ఏ నిర్ణయం తీసుకోబోతున్నానో భారత్కు కచ్చితంగా తెలుస్తుందని ట్రంప్ హెచ్చరించారు. 500కోట్ల డాలర్ల విలువైన ఎస్-400 క్షిపణులను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారత్కు వచ్చిన సమయంలో ఈ ఒప్పందం కుదిరింది. అమెరికా కొత్తగా సవరణ చేసిన కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ ప్రకారం అధ్యక్షుడికి మాత్రమే ఇప్పుడు భారత్పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఒప్పందంపై మీరు ఏం చేయబోతున్నారు అని ట్రంప్ను ప్రశ్నించగా.. భారత్కు అతి త్వరలో తెలుస్తుంది అని అన్నారు. ఎప్పుడు అని అడగగా.. మీరు ఊహించిన దాని కంటే త్వరగానే ఆ నిర్ణయం ఉంటుందని స్పష్టంచేశారు.