Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షు డు కిమ్ మధ్య రెండో దఫా చర్చలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వీరిద్దరి మధ్య వచ్చే ఏడాది జనవరిలో రెండో దఫా భేటీ జరిగే అవకాశం ఉందని వైట్ హౌస్ శనివారం వెల్లడించింది. ఈఏ డాది జూన్లో సింగపూర్ నగరంలో వీరిద్దరి మధ్య చరిత్రాత్మక భేటీ జరి గిన సంగతి తెలిసిందే. ఈ చర్చల అనం తరం సంపూర్ణ అణ్వాయుధీకరణకు కిమ్ అంగీకరించారు. అయితే ఇరు దేశా ల మధ్య మరికొన్ని అంశాల్లో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. ఈ వివాదా లను రెండో దఫా చర్చల్లో పరిష్కరించుకుని ఉత్తర కొరియా చేత అణ్వాయుధ నిరాయుధీకరణను వేగవంతం చేయించాలని ట్రంప్ యంత్రాంగం భావి స్తోంది.రెండో దఫా భేటీకి సంబంధించి ఇరు దేశాల విదేశాంగ అధికారులు ఇప్పటికే చర్చలు మొదలుపెట్టారు. జనవరి 1 తర్వాత కొత్త సంవత్సరంలో ట్రంప్, కిమ్ మధ్య రెండో దఫా భేటీ ఉంటుందని శ్వేతసౌధానికి చెందిన ఓ సీనియర్ అధికారి మీడియా ప్రతినిధులకు తెలిపారు.
మరో బ్రెగ్జిట్ కోసం లండన్లో భారీ ర్యాలీ
ఒకప్పుడు యూరోపియన్ యూనియన్లో ఉండమంటూ బ్రెగ్జిట్కు అనుకూలంగా ఓటేశారు.. కానీ ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో కలిసి ఉండాలని లండన్ జనం అనుకుంటున్నారు. దీంతో మరోసారి బ్రెగ్జిట్పై ఓటింగ్ నిర్వహించాలంటూ లండన్లో భారీ ప్రదర్శన చేపట్టారు. నేడు వేలాది సంఖ్యలో ఉద్యమకారులు సెంట్రల్ లండన్లో ఓ ర్యాలీగా బయల్దేరారు. బ్రెగ్జిట్పై మరోమారు ఓటింగ్ నిర్వహించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు.