Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేరాన్ని అంగీకరించిన సౌదీ
రియాద్: అత్యంత వివాదాస్ప దంగా మారిన జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి అదృశ్యం కేసులో.. మొదటి సారి సౌదీ అరేబియా నోరు విప్పింది. ఇస్తాంబుల్లోని సౌదీ దౌత్యకార్యాల యంలోనే ఖషోగ్గి హత్యకు గురైనట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. కాన్సులేట్లో జరిగిన ఓ ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయినట్టు సౌదీ స్టేట్ మీడియా వెల్లడించింది. ఈ ఘటనతో సంబంధమున్న ఆరోపణ లపై సౌదీకి చెందిన అయిదుగురు ఉన్నతాధికారులను తొలిగించారు. మరో 18 మందిని అరెస్టు చేశారు. ఈనెల2న సౌదీ కాన్సులేట్ లోపలికి వెళ్లిన ఖషోగ్గి బయటకు తిరిగి రాలేదు. అదృశ్యమైన ఖషోగ్గిని సౌదీని హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అతని శవాన్ని ముక్కలు ముక్కలు చేసి సమీప అడవుల్లో పడేసినట్టు పుకార్లు వచ్చాయి. ఈ హత్యా ఘటనను సిరీయస్గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం సౌదీపై ఒత్తిడి తెచ్చింది. మొదట్లో ఖషోగ్గి గురించి తమకేమీ తెలియదన్న సౌదీ.. తాజాగా అతను కౌన్సులేట్లోనే హత్యకు గురైనట్టు వెల్లడించింది. కాన్సులేట్లో ఖషోగ్గితో వాగ్వాదం చోటుచేసుకుందని, ఆ తర్వాత జరిగిన ఘర్షణలో అతను ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో సౌదీ ప్రిన్స్ సల్మాన్ సలహాదారుడు ఖతానితో పాటు డిప్యూటీ ఇంటెలిజెన్స్ చీఫ్ మేజర్ అసిరిని తొలిగించారు. అమెరికా పౌరత్వం కలిగిన ఖషోగ్గి.. ద వాషింగ్టన్ పోస్ట్లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. సౌదీ రాచరిక పాలనను అతను తీవ్రంగా విమర్శించేవారు. అయితే ఖషోగ్గిని హత్య చేసి, ఆ తర్వాత ముక్కలు చేసి అడవుల్లో పడేసిన ఘటనకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు మా దగ్గర ఉన్నాయని టర్కీ హెచ్చరించిన నేపథ్యంలో.. సౌదీ తన తప్పును అంగీకరించింది.