Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోలింగ్ కేంద్రం వద్ద ఆత్మాహుతి దాడి
- 170 మంది మృతి? వందల సంఖ్యలో క్షతగాత్రులు
కాబూల్ : అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. అఫ్ఘాన్లో శనివారం పార్లమెంట్ ఎన్నికల నిర్వహణను ఆది నుంచి బహిష్కరించాలని హెచ్చరిస్తున్న తాలిబన్లు తాజాగా పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అధికారికంగా సుమారు. 25 మంది చనిపోయినట్టు చెబుతుండగా అనధికారికంగా 170 మంది చనిపోయారని మీడియా కథనాలు వస్తున్నాయి. అలానే వందల సంఖ్యలో పౌరులు గాయపడినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రసంస్థ కూడా ప్రకటించుకోలేదు. తాలిబన్లే ఈఘాతుకానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఆత్మాహుతి జరగడంతో ఓటర్లు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఉగ్రదాడుల నేపథ్యంలో పలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకునేందుకు ఓటర్లు భయపడ్డారు. కాని ఈసారి మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు.
ఉద్రిక్త నడుమ ప్రారంభమైన ఎన్నికలు : అఫ్ఘాన్లో 2015 నుంచి పెండింగ్లో ఉన్న పార్లమెంటరీ ఎన్నికలు శనివారం ప్రారంభమయ్యాయి. పోలింగ్ అడ్డుకుంటామన్న తాలిబన్ల హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అఫ్ఘనిస్తాన్లోని 250 స్థానాలకు కొందరు మహిళలతో పాటు మొత్తం 2500 మందికి పైగా అభ్యర్థులు పోటీపడుతున్నారు. కానీ, 30 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాలను భద్రతాపరమైన కారణాలతో మూసివేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పది మంది అభ్యర్థులు ఇప్పటికే హత్యకు గురయ్యారు.
మొదట 7 వేల పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించాలని భావించినా భద్రతా కారణాలతో దాదాపు 5 వేల పోలింగ్ బూతులను మాత్రమే ఏర్పాటు చేశారు. వీటిని బూటకపు ఎన్నికలుగా వర్ణిస్తున్న తాలిబన్లు పోలింగ్ బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎన్నికలు ఎందుకంత ముఖ్యం : అఫ్ఘనిస్తాన్ ప్రజలు చాలామంది మెరుగైన జీవితం, ఉద్యోగాలు, విద్య కోసం తపించిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో తాలిబన్లు దేశంలోని అత్యధిక భూభాగాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. తాలిబన్లతో జరుగుతున్న యుద్ధానికి తెరపడాలని కోరుకుంటున్నారు.
దశాబ్దానికి పైగా జరిగిన పోరాటంలో వేల మరణాలు, లక్షల డాలర్ల వ్యయం, ఎన్నో ఏండ్ల పెట్టుబడుల తర్వాత అఫ్ఘనిస్తాన్లో మళ్లీ ప్రజాస్వామ్యం వికసిస్తుందని మిత్ర దేశా లు ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల్లో ఉన్నత విద్యావంతులైన చాలా మంది యువతీయువకులు పోటీ చేస్తున్నారు. యుద్ధంలో నలిగిపోతున్న దేశంలో మార్పు తీసుకొచ్చేందుకు సహకరిస్తామని చెబుతున్నారు. ఈ ఎన్నికలు ప్రస్తుత అసెంబ్లీ ఐదేండ్ల పదవీకాలం ముగిసినప్పుడు 2015లో జర గాల్సినవి. కానీ 2014లో జరిగిన వివాదాస్పద అధ్యక్ష ఎన్ని కల తర్వాత అంతా మారిపోయింది. ఆ ఎన్నికలు అఫ్ఘనిస్తాన ్ను అంతర్యుద్ధం అంచులదాకా తీసుకొచ్చాయి. 2019లో జరిగే అధ్యక్ష ఎన్నికలకు ముందు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలను వాటికి సెమీఫైనల్గా భావిస్తున్నారు.
తాలిబన్ల దాడిలో
ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు మృతి
అఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు మెరుపుదాడికి పాల్ప డ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు మృతి చెందారు. మృతుల్లో కాందహార్ పోలీస్ జనరల్ అబ్దుల్ రాజిఖ్, ఇంటెలిజెన్స్ చీఫ్ అబ్దుల్ మోమిన్ ఉన్నారు. ఈ ఘటనతో కాందహార్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాందహార్ ఎస్పీ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...కాందహార్ దక్షిణ ప్రావిన్స్లో తాలిబన్లకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కీలక పోలీస్ అధికారులిద్దరూ మృతిచెందారు. భద్రతా ప్రమాణాలు, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలనే అంశాలపై రాజీఖ్, యూఎస్ కమాండర్ జనరల్ స్కాట్ మిల్లర్ మధ్య సమావేశం జరిగింది. వీరిద్దరి భేటీ కొనసాగుతున్న సమయంలో తాలిబన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో స్కాట్ మిల్లర్ గాయపడ్డారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్లు ప్రకటించుకున్నారు. స్కాట్ మిల్లర్, అబ్దుల్ రాజిఖ్ల రహస్య భేటీని వ్యతిరేకిస్తూ తామీ దాడులకు పాల్పడినట్టు వెల్లడించారు. యూఎస్ కమాండర్ జనరల్ లక్ష్యంగా తాలిబన్లు దాడులకు పాల్పడటాన్ని నాటో అధికార ప్రతినిధి ఖండించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా తాలిబన్ల స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడతామని హెచ్చరించారు.