Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ప్రభుత్వంపై విమర్శలు సంధించే వారిపై ఎదురుదాడికి సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యేకంగా ఆన్లైన్లో ట్విట్టర్ సేనను ఏర్పాటు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన వార్తా కథనంలో పేర్కొంది. టర్కీలోని సౌదీ దౌత్య కార్యాలయంలో జర్నలిస్టు ఖషోగ్గీ హత్యలో ఈ ట్విట్టర్ సేనకు కూడా పాత్ర వుందని పేర్కొంది. ఖషోగ్గీ, ఇతర విమర్శకులపై దాడి చేయటంతో పాటు వారికి వ్యతిరేకంగా ఆన్లైన్లో ప్రజాభిప్రాయాన్ని పొందుపర్చటం వంటి చర్యల ద్వారా ఈ ట్విట్టర్ సేన దాడి చేస్తుందని టైమ్స్ పత్రిక వివరించింది. ట్విట్టర్ ఖాతాలపై నిఘా వుంచటం, ప్రభుత్వ విమర్శలను పోస్ట్ చేసిన వారిని వేధించటం ఈ ట్విట్టర్ సేన ప్రధాన లక్ష్యాలని ఈ పత్రిక తెలిపింది.