Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పుస్తకం ప్రచురించినందుకు
కైరో : ఈజిప్టు ఆర్థికవేత్త, ప్రముఖ రచయిత అబ్దెల్ ఖాలిఖ్ అరెస్ట్ అయ్యారు. ఈజిప్టు ఆర్థిక విధానం, సామాజిక సమస్యలపై ఖాలిఖ్ ప్రచురించిన ఓ పుస్తకం వివాదాస్పదమైంది.' ఈజిప్టు నిజంగా పేద దేశమేనా?' టైటిల్తో ఆయన రాసిన పుస్తకాన్ని దేశ ప్రజలు స్వాగతించారు. కానీ, ఇక్కడి ప్రభుత్వం ఈ పుస్తకాన్ని రచించిన రచయితను కటకటాలపాలు చేసింది. ఈ పుస్తకాన్ని లభించిన ప్రజాధరణ జీర్ణించుకోలేకపోవడంతోనే ప్రభుత్వం తన భర్తను నిర్బంధించిందని, తన భర్త అరెస్ట్పై న్యాయపోరాటం చేస్తానని ఖాలిఖ్ భార్య మీడియాతో చెప్పారు. ఈజిప్టు ప్రభుత్వం హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు. 2014లో ఈజిప్టు అధ్యక్షుడిగా అబ్దెల్ ఫతేV్ా ఎల్సిసీ బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయని, రచయిత పట్ల కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలను చైతన్యపరిచే రచనలు చేస్తున్నవారిపై ఆయన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఈజిప్టు రచయితలు ఆరోపిస్తున్నారు.