Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిడ్నీ: మయన్మార్లో మైనార్టీ రోహింగ్యాలపై అక్కడి సైన్యం కొనసాగి స్తున్న హింసా కాండకు వ్యతిరేకంగా ఆ దేశానికి చెందిన ఐదుగురు ఉన్నత స్థాయి సైనికాధి కారులపై ఆస్ట్రేలియా ప్రభుత్వం మంగళవారం ఆంక్షలు విధించింది. రోహింగ్యాలపై మయన్మార్ సైన్యం కొనసాగిస్తున్న దాడులు, వేధింపులకు బాధ్యులైన ఈ అధికారులపై ఆస్ట్రేలియాలో పర్యటనలపై నిషేధంతో పాటు, ఆర్థికపరమైన ఆంక్షలను విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా విదేశాంగమంత్రి మారిస్ పేన్ చెప్పారు. రఖైన్ రాష్ట్రంలోని రోహింగ్యాలపై మయన్మార్ సైన్యం యుద్ధ నేరాలు, ఊచకోత వంటి అమానుష చర్యలు కొనసాగించినట్టు ఐరాస ప్రకటించిన నేపథ్యంలో తాము ఈ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆయన వివరించారు.