Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోఫియా : బల్గేరియా సముద్ర తీరంలో 2400 ఏండ్ల నాటి పడవ శకలం లభ్యం కావడం కలకలం రేపింది. గ్రీకుల కాలంలో ఈ పడవను వాణిజ్యం కోసం ఉపయోగించేవారని నావికాదళ అధికారులు తెలిపారు. నల్లసముద్రంలో ఆంగ్లో బల్గేరియా సభ్యులకు ఈ పడవ శకలం లభ్యమైందని అన్నారు. దీని పొడవు 23 మీటర్లు ఉందని చెప్పారు. అయితే, ఈ పడవ ఇంకనూ చెక్కుచెదరలేదని అధికారులు తెలిపారు. బల్గేరియాలోని బుర్గాస్ నగరానికి 80కిలోమీటర్ల దూరంలో పడవ శకలాలు గుర్తించామని అన్నారు.