Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: ప్రపంచంలోనే అతి పెద్ద సముద్ర వంతెనను మంగళవారం చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఘనంగా ప్రారంభిం చారు. సముద్రం మీద నుంచి హాంగ్ కాంగ్, మకౌ, చైనా మెయిన్ ల్యాండ్లోని జుహై నగరాన్ని అనుసంధానించే ఈ బ్రిడ్జి పొడవు 34 మైళ్లు (55 కిలో మీటర్లు). తొమ్మిదేండ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ బ్రిడ్జీ నిర్మాణం ఇటీవలే పూర్తయింది. ముందస్తు ప్రణాళికల ప్రకారం 2016లోనే ప్రారంభానికి నోచుకోవాల్సి ఉన్న ఈ బ్రిడ్జి నిర్మాణం అప్పటికి పూర్తి కాని కారణంగా మరో రెండేండ్లు ఆలస్యంగా ప్రారంభమైంది. సుమారు 20 బిలియన్ డాలర్ల ( రూ.1,47,170 కోట్లు ) వ్యయంతో సముద్రంపై నిర్మించిన ఈ వంతెన ప్రపంచంలోనే అతి పొడవైన సముద్ర వంతెనగా రికార్డుకెక్కింది.