Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : నవంబరు 6న జరిగే మధ్యంతర ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకోవాలని, లేని పక్షంలో ప్రజాస్వా మ్యానికి తీవ్ర ప్రమాదకరమైన పర్యవసానాలు ఎదురవుతాయని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. ప్రగతిశీల మార్పులు అమలు కావాలంటే కచ్చితంగా ఓటు వేయాలని, కేవలం విమర్శించడమొక్కటే సరిపోదని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
'నా జీవిత కాలంలో నాకు గుర్తున్నంతవరకు ఈ నవంబరు ఎన్నికలు చాలా కీలకమైనవి' అని లాస్వెగాస్ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు ప్రతీసారీ ఇలానే చెబుతూ వుంటారు, కానీ నిజంగానే ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక అని ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ ఒబామా ప్రసంగమంతా ఆయనను పరోక్షంగా ప్రస్తావిస్తూనే సాగింది. ఆర్థికంగా దేశం ఈ స్థితిలో ఉండడానికి తనదే ఘనత అని ట్రంప్ చెప్పుకోవడాన్ని ఒబామా ఖండించారు. 'ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆర్థిక అద్భుతాల గురించి మీరంతా చర్చించుకుంటున్నారు. వీటిని ఎవరు ప్రారంభించారో ఒక్కసారి గుర్తు చేసుకోండి' అని ఒబామా వ్యాఖ్యానించారు. 'కొంతమందిలా కాకుండా వాస్తవాలనే చెప్పేందుకు నేను ప్రయత్నిస్తుంటాను. వాస్తవిక రాజకీయాలపై నాకు పూర్తి నమ్మకం ఉంది' అని ఒబామా పేర్కొన్నారు.