Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 మంది మృతి
బ్రెసీలియా: ఈశాన్య బ్రెజిల్లో శుక్రవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలకు, పోలీసులకు మధ్య జరిగి న కాల్పుల్లో 12 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో దోపిడి దొంగలు బందీలుగా పట్టుకున్న ఆరుగురు పౌరులు కూడా ఉన్నారు. శుక్రవారం తెల్లవారున భారీ పేలుడు సామగ్రి, మారణాయుధాలతో మిలాగ్రెస్లోకి ప్రవేశించిన దుండగులు రెండు బ్యాంకులు దోచుకునేందుకు సిద్ధమ య్యారు. పోలీసులు వారి ప్రయత్నా న్ని అడ్డుకోగా.. పారిపోయే క్రమం లో ఎదురుగా కారులో వస్తున్న ప్రయాణికులను ఆపి బందీలుగా పట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు, బందీలకు మధ్య హోరాహోరీగా కాల్పులు జరి గాయి. కారులో ఉన్న ఇద్దరు చిన్నా రులు సహా ఒకే కుటుంబానికి చెంది న ఐదుగురు మృతి చెందారు. వీరు సావోపౌలో నుంచి క్రిస్మస్ వేడుకల కోసం విమానంలో మిలెగ్రెస్కు వచ్చిన బంధువులను ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో మృతువాత పడ్డారు. వీరిని దుండగులు కాల్పి చంపారా? లేక పోలీసుల ఎదురు కాల్పల్లో చనిపోయారా? అన్న విషయంలో స్పష్టత లేదు.