Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజింగ్: చంద్రుడి మీదకు చైనా శుక్రవారం రోవర్ను ప్రయోగించింది. ఛేంజ్ 4 లూనార్ ప్రోబ్ మిషన్ పేరుతో ప్రయోగాన్ని చేపట్టారు. చైనా పురాణాల ప్రకారం ఆ మిషన్కు పేరు పెట్టారు. లాంగ్ మార్చ్ 3బీ రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు. జీచాంగ్ లాంచ్ సెంటర్ నుంచి రోవర్ను నింగిలోకి పంపారు. ఛేంజ్ 4 మిషన్.. చంద్రుడి ఉపరితలంపై దిగనున్నది. న్యూ ఇయర్ సమయానికి ఆ రోవర్ ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చంద్రుడిపై ఉన్న చీకటి ప్రదేశాల్లో ఈ ప్రోబ్ అన్వేషణ చేపట్టనున్నది. అంతరిక్ష పరిశోధనల్లో ఈ ప్రయోగం కీలకమైందని చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి దిశగా కనిపిస్తున్న చంద్రుడి ఉపరితలం చాలా ఫ్లాట్గా ఉంటుంది. కానీ కనిపించని ప్రదేశాల్లో ఎక్కువ శాతం కొండలు, లోయలు ఉంటాయి. అయితే ఛేంజ్ 4 రోవర్ ఇప్పుడు ఆ ప్రదేశాలను అన్వేషించనున్నది. డార్క్ సైడ్గా పిలువబడే చంద్రుడి ప్రదేశంపై మొదటి సారి ఓ రోవర్ దిగనున్నది.