Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ
దుబాయి: అమెరికా విధిస్తున్న ఆంక్షలను ఆర్థిక ఉగ్రవాదంగా ఇరాన్ అధ్యక్షుడు హస్సన్ రౌహానీ శనివారం అభివర్ణించారు. పలు సమస్యలతో సతమతమవుతన్న ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరిచేందుకు అమెరికా ఆంక్షలు విధించినట్టయితే పశ్చిమ దేశాలపై మాదక ద్రవ్యాలు, శరణార్థుల దాడుల వెల్లువ ఉండవచ్చునని పేర్కొన్నారు. ''మాదకద్రవ్యాలు, ఉగ్రవాదంపై పోరాడటానికి ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసినట్టయితే.. మాదక ద్రవ్యాలు, శరణార్ధులు, బాంబులు, ఉగ్రవాదం, జలాంతర్గముల నుండి సురక్షితంగా ఉండలేరని ఆంక్షలు విధించే వారిని హెచ్చరిస్తున్నాను'' అని స్థానిక మీడియాలో లైవ్ షోలో పేర్కొన్నారు.