Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు ప్రమాదాలపై డబ్ల్యూహెచ్ఓ నివేదిక
- 10 లక్షలు దాటిన మృతులు
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా 24 సెకన్లకో రోడ్డు ప్రమాద మరణం జరుగుతున్నదని, ఏడాదికి 10 లక్షల 34 వేల మంది చనిపోతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. ఈ మూడేండ్లలో ఏడాదికి సగటున లక్ష మరణాలు పెరిగాయని తెలిపింది. మృతుల్లో ఎక్కువమంది ఐదేండ్ల నుంచి 29ఏండ్ల వయస్సు మధ్యలో వారే ఉంటున్నారని టెడోస్ అధోనం గెబ్రియోసియస్ తెలిపారు. 2013 నుంచి అందిన లెక్కల ప్రకారం ఏడాదికి 1.25 మిలియన్ల (12.5లక్షలు) మంది మరణిస్తున్నారని పేర్కొంది. ప్రమాదాల నివారణకు అనేక దేశాలు చర్యలు తీసుకుంటున్నాయని, అయితే వెనుకబడిన దేశాల్లో రక్షణ చర్యలు తక్కువగా ఉన్నాయని తెలిపింది. ఆఫ్రికాలో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతి లక్షమందికి 26.6 శాతం మరణాలు నమోదవుతున్నాయి. యూరోప్లో ఇది 9.3 శాతంగా, ఆఫ్రికాలో ఇది 44 శాతం ఉన్నది.