Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాక్ డార్సీపై నెటిజన్ల ఆగ్రహం
వాషింగ్టన్ : 'మయన్మార్లో శాంతియుత వాతావరణం కొనసాగుతున్నది. రోహింగ్యాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. వారికి సరిపడ ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. గతనెలలో నేను మయన్మార్లో పర్యటించాను. ఈ ప్రదేశం పర్యాటక కేంద్రంలా తలపించింది' అంటూ ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ చేసిన ట్వీట్లు పెను దుమారం రేపాయి. ఆయన ట్వీట్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహింగ్యా ముస్లింల దయనీయ స్థితి పట్ల జాక్ డార్సీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు నెటిజన్లు చురకలంటించారు. రోహింగ్యాల ఆర్తనాధాలు ట్విట్టర్ సీఈవోకు సంగీత స్వరంలా కనిపిస్తున్నదా ? అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రోహింగ్యా ముస్లిం దయనీయ స్థితిపై గతనెలలో ఫేస్బుక్ సామాజిక మాధ్యమం ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రోహింగ్యాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విచారం వ్యక్తం చేసింది. ఇక్కడి హింసాత్మక ఘటనల నిర్మూలనకు ఫేస్బుక్ వేదికగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. కాగా, మయన్మార్లోని రోహింగ్యా ముస్లింలపై అక్కడి భద్రతాబలగాలు దాడులకు పాల్పడుతున్నాయి. వీరి దాడుల్లో వెయ్యి మందికిపైగా రోహింగ్యాలు మృతిచెందారు. వందలాది మంది ఇండ్లను సైనికులు నిర్ధాక్షిణ్యంగా తగులబెట్టారు. అనేక మంది మహిళలపై లైంగికదాడులకు పాల్పడ్డారు. చిన్నారులను హతమార్చారు. మయన్మార్ బలగాల దుశ్చర్యలు, దాడుల భయంతో భీతిల్లిన రోహింగ్యా ముస్లింలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. నిరాశ్రయులైన వేలాది మంది రోహింగ్యాలు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇతర దేశాల ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రోహింగ్యా ముస్లింలకు సాయమందించాలని గతనెలలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు.