Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెర్లిన్ : జర్మనీలో రైల్వే కార్మికులు కదం తొక్కారు. జీతాలు పెంచకపోవడంతో నిరసన బాటపట్టారు. సోమవారం దాదాపు నాలుగు గంటలపాటు పలు రైళ్ల రాకపోకలను స్తంబింóప చేశారు. ఫలితంగా లక్షలాది మంది ప్రయాణీకులు రైల్వే స్టేషన్లలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు గంటల తర్వాత సేవలను పునరుద్ధరించినట్టు రైల్వే శాఖ పేర్కొంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...డ్యూస్చే బాన్ (డీబీ) ఆపరేటర్ సంస్థకు చెందిన లక్షా 60వేల మంది కార్మికులు రైల్వే శాఖలో పని చేస్తున్నారు. జీతాలు పెంచాలని వీరు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఇంటర్సిటీ, రీజినల్ సర్వీసెస్ సంస్థలు డీబీ రైల్వే కార్మికులతో ఆదివారం భేటీ అయ్యాయి. ఈ చర్చల్లో పాల్గొన్న కార్మికులు తమ జీతాలను 7.5శాతం పెంచాలని డిమాండ్ చేశా రు. అయితే, వీరి డిమాండ్లను పరిష్కరించేందుకు రైల్వే అధికారులు నిరాకరించారు. చర్చల పట్ల అసంతృప్తికి గురైన కార్మికులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కాగా, 5.1శాతం జీతాలు పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు రైల్వే శాఖ పేర్కొంది. రెండు విడతల్లో జీతాలు పెంచను న్నట్టు తెలిపింది. కార్మికులు తక్షణమే ఆందోళక విరమించాలని కోరింది.