Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ హెచ్చరిక
న్యూయార్క్: అక్రమ వలసలతో మానవాళి భారీ మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుందని ఐరాస సదస్సులో ప్రసంగించిన ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ స్పష్టం చేశారు. ఎడారులు, సముద్రాలు, నదులు దాటుకుని పొట్ట చేతపట్టుకుని వచ్చే వలసవాసులు స్మగ్లర్లు, అనైతిక పద్ధతులు అనుసరిస్తున్న యాజమాన్యాల చేతుల్లో తమ జీవితాలను పెడుతూ బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2000 నుంచి ఈ ఏడాది నవంబర్ నాటికి దాదాపు 60 వేల మందికి పైగా వలసవాసులు మార్గమధ్యంలోనూ గమ్యస్థానానికి సమీపంలోనో ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. ఇది మనందరికీ సిగ్గుచేటైన విషయమని ఆయన అన్నారు.