Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు
- నిందితుడి కోసం కొనసాగుతున్న గాలింపు
పారిస్ : ఫ్రాన్స్లో కాల్పులు కలకలం సృష్టిం చాయి. స్ట్రాస్బర్గ్ ప్రాంతంలో రద్దీగా ఉండే క్రిస్మస్ మార్కెట్లో ఓ దుండగుడు చొరబడి కాల్పులకు తెగ బడ్డాడు. అతను జరిపిన కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. మరో 12 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పుల సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు స్ట్రాస్బర్గ్లోని క్రిస్మస్ మార్కెట్ను చుట్టుముట్టాయి. నిందుతున్ని పట్టుకునేందుకు ప్రయత్నించాయి. ఈక్రమంలో దుండగుడికి, బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాగా, దుండగుడు ఘటనాస్థలం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. దుండగుడు ఎందుకు కాల్పులకు పాల్పడ్డాడో కారణం తెలియరాలేదు. ఈ ఘటనపై పారిస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెమీ హీట్జ్ స్పందించారు. చెరిఫ్ చెకాట్ (29) అనే యువకుడు ఈ కాల్పులకు పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. కాల్పులకు పాల్పడిన అనంతరం అతను టాక్సీలో పరారయ్యాడని, టాక్సీ డ్రైవర్ వాంగ్మూలం సేకరించామని అన్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని పారిస్ డిప్యూటీ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ నూనెజ్ తెలిపారు. కాల్పులకు పాల్పడ్డ నిందితుడు నేరచరితుడని అన్నారు. అతనికి ఉగ్రసంస్థలతో సంబంధాలున్నాయని అన్నారు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీలో అతనిపై పలు కేసులు నమోదై ఉన్నాయన్నారు.
నిందితుడు 27సార్లు జైలుశిక్ష అనుభవించాడని చెప్పారు. నిందితుడి నివాసంలో లభ్యమైన రైఫిల్, గ్రెనేడ్, నాలుగు కత్తులు, వేటకొడవలి, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని నూనెజ్ వెల్లడించారు. కాల్పుల ఘటన చోటుచేసుకున్న ప్రాంతం ఫ్రాన్స్ పార్లమెం ట్కు సమీపంలో ఉందన్నారు. ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతు న్నాయని అన్నారు. పార్లమెంట్ సభ్యుల లక్ష్యంగా దుండ గుడు కాల్పులకు పాల్పడినట్టు అనుమానిస్తు న్నామన్నారు. పారిస్లోని అన్ని క్రిస్మస్ మార్కెట్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించాయి.