Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహ్రాన్ : స్వీడన్లో ఐరాస ఆధ్వర్యంలో జరిగిన చర్చల సందర్భంగా ప్రత్యర్ధి పక్షాల మధ్య కుదిరిన తొలి ఒప్పందాలను ఇరాన్ విదేశాంగ మంత్రి యావద్ జరీఫ్ ప్రశంసించారు. యెమెన్ ఘర్షణలకు రాజకీయ పరిష్కారాన్ని కనుగొనేందుకుగానూ చర్చలకే తమ దేశం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఐక్యరాజ్య సమితి దూత పర్యవేక్షణలో స్టాకహేోంలో యెమెన్ ప్రత్యర్ధి వర్గాల మధ్య కుదిరిన ఒప్పందాలను ఇరాన్ స్వాగతిస్తోందని జరీఫ్ చెప్పారు. అన్ని అంశాలపై తుది ఒప్పందాలు ఖరారయ్యే వరకు చర్చలు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. యెమెన్పై వైమానిక దాడులు నిలుపుచేసి, నేరాలకు స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని జరీఫ్ స్పష్టం చేశారు.